హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ములుగు( BRS Mulugu ) జిల్లా అధ్యక్షుడిగా కే. లక్ష్మణ్రావు (Laxman Rao ) ను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు (CM KCR) మంగళవారం నియమించారు. బీఆర్ఎస్ ములుగు తొలి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించిన కుసుమ జగదీశ్ (Jagadish) ఇటీవల అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది.
జడ్పీ చైర్పర్సన్గా తాడ్వాయి జడ్పీటీసీ, వైస్చైర్పర్సన్గా కొనసాగుతున్న బడే నాగజ్యోతిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియమించటమే కాకుండా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election) నాగజ్యోతి ములుగు అభ్యర్థిగా బరిలో నిలువనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లాలో పట్టున్న, పార్టీ శ్రేణుల్లో సమన్వయకర్తగా పేరున్న కే. లక్ష్మణ్రావును సీఎం కేసీఆర్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించటం విశేషం.