ములుగు : జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శివారులో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగరాజు (32) బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.