ఏటూరునాగారం, ఆగస్టు 3 : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సునారికాని సుస్మిత(15) జ్వరం, కామెర్ల బారిన పడి మృతి చెందింది. వారం రోజులుగా జ్వరం రావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించారు.
తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా జ్వరం, కామెర్లు ఎక్కువ కావడంతో బుధవారం మృతి చెందింది. సుస్మిత తండ్రి సమ్మయ్య ఏడాది క్రితం కరోనాతో మృతి చెందాడు. మృతురాలికి తలి,తమ్ముడు ఉన్నారు.