ములుగు : ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మను, ఆదిదేవత గట్టమ్మను భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. కవిత వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, మాజీ ఎమ్మెల్సే వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.