71 శాతంతో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల హవా
3954 మందికి 2801 మంది పాస్
జిల్లాలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో టీఎస్ఆర్ఎస్ విద్యార్థులు
తృతీయ స్థానంలో మంగపేట విద్యార్థిని
ఇంటర్ ఫలితాల్లో ఏజెన్సీ జిల్లా ములుగు మెరిసింది. 71శాతంతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించి సత్తాచాటింది. జిల్లాలోని 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాల విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయభేరి మోగించారు. ఫస్ట్ ఇయర్లో రాష్ట్రంలో జిల్లాకు 5వ స్థానం, సెకండియర్లో 6వ స్థానం దక్కగా ఒకేషనల్లో ఫస్ట్ ఇయర్లో 2వ స్థానం, సెకండియర్లో 3వ స్థానంలో నిలిచింది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేదు. మూడేళ్ల క్రితం జిల్లాలో 50 నుంచి 60శాతం ఉత్తీర్ణత నమోదైతే మంగళవారం ప్రకటించిన రిజల్ట్స్లో 71శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ములుగు, జూన్28 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాలు విజయ భేరి మో గించాయి. కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలు నిర్వ హించని విషయం తెలిసిందే.. మూడు సంవత్సరాల క్రితం జిల్లాలో 50 నుండి 60శాతం ఉత్తీర్ణత నమోదైతే మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 71శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఇంటర్లోని అన్ని కోర్సుల్లో కలిపి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఐదో స్థానం దక్కింది. ఫ స్ట్ ఇయర్లో 5వ స్థానం, సెకండ్ ఇయర్లో 6వ స్థానం దక్కగా ఒకేషనల్ విభాగంలో ఫస్ట్ ఇయర్లో 2వ స్థానం, సెకండ్ ఇయర్లో 3వ స్థానం దక్కింది. ప్రైవేటుగా హాజరైన విద్యార్థుల్లో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. జిల్లాలో మొత్తం 32 జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కాగా, 17 వివిధ విభాగాలకు చెందిన ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో మెగైన ఫలితాలు వచ్చాయి. ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా ఫలితాలు అంతంతమాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లా విద్యార్థుల ప్రతిభ
ఫలితాల్లో ములుగు జిల్లాకు చెందిన విద్యార్థులు 71శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో ములుగు మండలంలోని బండారుపల్లి, టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థి జే అనిల్కుమార్ 967 మార్కులతో జిల్లా టాపర్గా ని లిచారు. ఇదే కళాశాలకు చెందిన యు సాయితేజ ఎంపీసీలో 962 మార్కులు సాధించి ద్వితీయ స్థానం లో నిలిచారు. మంగపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బండారి మేరి బైపీసీలో 960 మార్కుల తో తృతీయ స్థానం దక్కించుకుంది. ఫస్టియర్లో బండారుపల్లి టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ కే సాయికుమార్ 462 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన జే సమీర్ ఎంపీసీలో 450 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2,049 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,433 మంది ఉత్తీర్ణులై 68శాతం ఫలితాలను సాధించారు. సెకండియర్లో 1,905కి 1368 మంది ఉత్తీర్ణులై 71శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,678 మందికి 1,206 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఒకేషనల్ విభాగంలో వాజేడు మండలం కేజీవీబీ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో నాంపల్లి వైష్ణవి మొదటి సంవత్సరంలో 480 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
జయశంకర్ జిల్లాలో 61 శాతం..
భూపాలపల్లి రూరల్, జూన్ 28 : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభు త్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించినట్లు ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి దేవరాజం ఒక ప్రకటనలో తెలిపా రు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 1,511 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 930 మంది పాసయ్యారు. వోకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 239 మందికి 164 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 1,626 మందికి 842 మంది, వోకేషనల్ ప్రథమ సంవత్సరంలో 372 మందికి 203 మంది పాసైనట్లు చెప్పారు. జిల్లాలో సెకండియర్ 61 శా తం, ఫస్టియర్ 52.3 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నిరంతర పర్యవేక్షణతో మెరుగైన ఫలితాలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను పటిష్టం చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేయడంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. అధ్యాపకులు సైతం ఉత్తమ విద్యాబోధన చేశారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ సైతం పరీక్షలను పర్యవేక్షించి సౌకర్యాల్లో లోటు పాట్లు రాకుండా చూశారు.
– పీ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ ములుగు జిల్లా నోడల్ అధికారి