డోర్నకల్, ఏప్రిల్ 10 : సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షే మ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సోమవారం డోర్నకల్ మండలం గొల్లచర్ల క్రాస్రోడ్డు సాయిగార్డెన్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ 50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రా మ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు రాజ్యాధికారం కట్టబెట్టారని, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను పెంచినట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఎవరొచ్చినా నియోజకవర్గంలో రెడ్యానాయక్ చేసిన అభివృద్ధి పనులు లెక్క పెట్టుకుంటూ వెళ్లాలే తప్పా.. వారి చేసేదేమీ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో మోడల్గా తీర్చిదిద్దారని, ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు తెలిపారు. మోదీ గతంలో చెప్పిన మాటలను మరిచి సింగరేణి గనులను వేలం వేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవితి తల్లి ప్రేమను చూపుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. హైదరాబాద్కు వచ్చిన మోదీ ప్రారంభించిన రైలునే మళ్లీ ప్రారంభించి వెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేసినా ఆ పార్టీ నాయకులు ఏమీ చేయకుండా దద్దమ్మల్లా మిన్నకుండిపోయారని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రతి గడపకూ తీసుకెళ్లాలన్నారు. ముచ్చటగా మూడో సారి కేసీఆర్ను గెలిపించేందుకు కంకణం కట్టుకోవాలన్నారు.
ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. ప్రజలు సేవ చేసే భాగ్యం కల్పించారని, వారి సేవలో తరిస్తానన్నారు. డోర్నకల్ ఒక దేవాలయమని, అందు లో ప్రజలే దేవుళ్లని, తాను వారికి సేవ చేసే భక్తుడినన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలోనే రాష్ర్టాన్ని దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దారని, మూడున్నరేళ్లలోనే కాళేశ్వర ప్రాజెక్టును నిర్మించి ప్రతి ఎకరాకు సాగు నీళ్లు అందిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో 73వేల మంది రైతులకు ఏటా రూ.180 కోట్లు రైతుబంధు, 3వేలకు పైగా రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 150కోట్ల రైతు బీమా, 45వేల మందికి ఆస రా పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 50వేల వ్యవసాయ మోటర్లకు 24 గంటల ఉచిత కరంట్ అందిస్తున్నామన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు రూ.45కోట్ల కేటాయించిందన్నారు. ఈ నెల 14న హైదరాబాద్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపా రు.
ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పురా ణం సతీశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ‘ఆఫ్ కీ బార్ కిసాన్ సర్కారు’ నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోకి వచ్చి మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. కాగా, ఆత్మీయ సమ్మేళనంలో సుమారు 5వేల మంది శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు డీఎస్ రవిచంద్ర, గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, మండల అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్ చైర్మన్ వీరన్న, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యా సాగర్, ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, జడ్పీటీసీ పొడిశెట్టి కమలారామనాథం,మున్సిపల్ వైస్చైర్మన్ కోటిలింగం, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, మాజీ జడ్పీటీసీ గొర్ల సత్తిరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్త రాంబాబు, మండల ఉపాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల యూత్ అధ్యక్షుడు అంగోత్ హరీశ్నాయక్, ఎంపీటీసీలు నున్న మల్లికార్జున్, బాన్త్ శంకర్కోటి, భూక్యా శ్రీనివాస్, నంజ్యాల నాగమణి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకన్న, మండల కో ఆప్షన్ షేక్ లాల్మియా, సర్పంచ్ సమ్మిరెడ్డి, గుగులోత్ శ్రీనివాస్, గుగులోత్ సునీత, అంజయ్య, రాంప్రసాద్, లెనిన్కుమార్, కౌన్సిలర్లు పోటు జనార్దన్, శరత్ బాబు, అశోక్, కందుల అరుణ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అజిత్మియా, నాయకులు శ్రీనివాస్, నంజ్యాల మధు, సామినేని సతీశ్, నాగభూషణం పాల్గొన్నారు.