మహబూబాబాద్, జనవరి 26: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 85 మంది లబ్ధిదారులకు రూ.27 లక్షల 38 వేల 500ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల శ్రేయస్సు కోసమే పని చేస్తున్నదని చెప్పారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందిస్తున్నదని వివరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి శుద్ధిచేసిన తాగునీరు అందిస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, సంపెట రాము, డీ ప్రవీణ్కుమార్, వీ కిశోర్, కొత్తగూడ మండల అధ్యక్షుడు వేణు, బీ పృథ్వీరాజ్, బీ శ్రీనివాస్, సురేశ్, బీ లక్ష్మణ్, పీ శ్రీను, పీ యుగేంధర్, ఆసిఫ్ అలీ, బానోత్ రాము, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.