వరంగల్ చౌరస్తా, జూలై 27: ఎన్నికల సమయంలో మూడు నెలల్లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా తమను పట్టించుకోవడం లేదని ఉద్యమ కళాకారులు వాపోయా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం వారు వరంగల్ నగరం లో భిక్షాటన చేశారు. సకల కళా సాంస్కృతిక మండలి, తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్య వేదిక, వారసత్వ కళల సంరక్షణ సమితిల ఆధ్వ ర్యంలో వరంగల్ రైల్వేస్టేషన్ జంక్షన్ నుంచి ఎంజీఎం సర్కిల్ వరకూ రోడ్డు కు ఇరువైపులా కరపత్రాలు పంచుతూ.. పాటలు పాడుతూ జోలెపట్టి భిక్ష మెత్తి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కళాకారుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఒడ్డెక్కే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డెక్కినాక బోడ మల్లన్న అన్న ట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టు బడి అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీ, బీసీ, మైనా ర్టీలకు అనుసరిస్తున్న విధంగా కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందించాలని, వృద్ధాప్యంలో ఉన్న కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సకల కళాసాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షడు గడ్డం సుధాకర్, తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బిర్రు సురేందర్, వారసత్వ కళల సంరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్కే.రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా పరధిలోని కళాకారులు పాల్గొన్నారు.