వరంగల్ : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలతో పాటు వలలు, మోపెడ్లు అందజేసిందన్నారు. కుల సంఘం భవనిర్మాణం కోసం కూడా చేయూతనిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ రజినీ, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య శాఖ అధికారులు.