వరంగల్ : జిల్లా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నర్సంపేట మండలంలోని రాజుపేట, ఇప్పల్ తండా, ముత్తోజిపేట గ్రామాల్లో పంటలు తెబ్బతిన్నాయి. కాగా, దెబ్బతిన్న మొక్కజొన్న, మిర్చి పంటలను శుక్రవారం క్షేత్రస్థాయిలో నర్సంపేట ఎమ్మెలయే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.
బాధితులను పరామర్శించి, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని తప్పకుండా అందేలా కృషి చేస్తానని వారికి భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.