వరంగల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
షాదీ ముబారక్ వంటి పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారకం కాకుండా ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. అలాగే మైనార్టీల ఉన్నత విద్య కోసం కూడా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.