ఎల్కతుర్తి, ఏప్రిల్ 13 : దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో విడుత 9 గ్రామాలకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం కోతులనడుమ గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్ అధ్యక్షతన గురువారం జరిగింది. జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ఎమ్మెల్యే సతీశ్కుమార్ ముఖ్యఅతిథిగా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ను బలోపే తం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు దోహద పడుతాయ న్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామన్నారు. కానీ, కొందరు సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఎన్నడూలేని విధంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాకముందు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు ఉన్నాయా అని ప్రశ్నించారు. 2014లో గెలిచిన వెంటనే దేవాదుల నీళ్లు తీసుకొచ్చానని, మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్లో సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నేడు 3 లక్షల క్వింటాళ్ల వడ్లు పండుతున్నాయన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం అయితేనే అభివృద్ధి సాధ్యమని, అందుకే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో 66,800 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ. 520 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే, 48వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. 638 మందికి రైతు బీమా అందించినట్లు, కల్యాణలక్ష్మి ద్వారా రూ.100 కోట్లను ఆడబిడ్డలకు అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా 14 సబ్స్టేషన్లను కూడా మంజూరు చేయించుకుని కరంటు కోతలు లేకుండా చేసినట్లు వెల్లడించారు. 2014 ముందు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు లైన్లలో ఉండేవారని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా తాగునీటిని సీఎం కేసీఆర్ అందిస్తున్నారని కొనియాడారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు భారత్ కోసం బీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. ఇక మన ఎంపీ ఉన్నాడని ఆయన ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థం కాదన్నారు. ఎల్కతుర్తి మీదుగా వెళ్లే నాలుగు లేన్ల రోడ్లను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మంజూరు చేయించినవేనని స్పష్టం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని, ఆ ప్రాజెక్టు ఫలాలు త్వరలోనే రైతులకు అందుతాయన్నారు. ప్రాజెక్టు కింద ప్రతి ఒక్కరికీ న్యాయమైన పరిహారం అందించామన్నారు.
తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, ఆర్థికంగా, సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ను బలోపేతం చేసుకొని కేసీఆర్ను ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సతీశ్కుమార్ అందజేశారు. సమ్మేళనంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, మాజీ జడ్పీటీసీ శ్రీపతి రమా, సర్పంచ్ బోయినపల్లి రజిత, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు గొల్లె మహేందర్, మదన్మోహన్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.