నర్సంపేటరూరల్, నవంబర్ 4: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు శనివారం నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని భూదేవి, శ్రీదేవి సమేత వేణుగోపాల-వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు పెద్ది దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో జరిగిన స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పెద్ది దంపతులు వేడుకున్నారు. వేదపండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు ఇచ్చిన ఆతిధ్యాన్ని వారు స్వీకరించి స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో మళ్లీ తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత ఎమ్మెల్యే దంపతులు నల్లబెల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి-సుధాకర్రెడ్డి, మినుముల రాజు, శీలం రాంబాబు, నాయకులు రాయిడి రవీందర్రెడ్డి, రాయిడి దుష్యంత్రెడ్డి, బైరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై..
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన చాలామంది బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సింగాపురం గ్రామానికి చెందిన వాంకుడోత్ అజయ్, వాంకుడోత్ యువరాజ్, భూక్యా అనిల్తోపాటు మరో 8 మంది పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, యూత్ కన్వీనర్ మచ్చిక రవితేజ పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టాలి..
నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథంలోకి తీసుకొచ్చానని, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. శనివారం ఉదయం 7.30 గంటలకు తన సొంత మండలమైన నల్లబెల్లి మండలకేంద్రంలో పెద్ది సతీసమేతంగా పాల్గొని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని మూడుచెక్కలపల్లెలో తన తొలి ప్రచారాన్ని చేపట్టగా, పెద్దికి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలుకుతూ భారీగా తరలివచ్చిన బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి పెద్దదిక్కుగా ఉన్న రంగాయ చెరువును రిజర్వాయర్గా మార్చి గోదావరి జలాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. రామప్ప నుంచి రంగాయ చెరువుతోపాటు పాకాల, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలను తరలించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. డివిజన్లో వ్యవసాయం, విద్య, వైద్యానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. నాడు గుక్కెడు తాగునీరు అందించలేని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల పేరుతో ఈ ప్రాంత ప్రజలను నట్టేట ముంచేందుకు భూటకపు వాగ్దానాలతో ఓట్ల కోసం వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రచారంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, సర్పంచ్లు నానెబోయిన రాజారం, బానోత్ పూల్సింగ్, కరివేదుల వెంకట్రెడ్డి, గోనె శ్రీదేవి, ఊరటి అమరేందర్రెడ్డి, లావుడ్యా తిరుపతి, రవినాయక్, మండల ఎన్నికల ఇన్చార్జి చెట్టుపెల్లి మురళీధర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, ప్రధాన కార్యదర్శి కోటిలింగాచారి, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, క్లస్టర్ ఇన్చార్జీలు గందె శ్రీనివాస్గుప్తా, ఇంగ్లి శివాజీ, ప్రతాప్సింగ్, నాయకలు అంబరగొండ రాజు, అఖిల్ పాల్గొన్నారు.