ఖానాపురం, మార్చి 19: మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. భారీ వర్షానికి కొత్తూరు, మంగళవారిపేటలో దెబ్బతిన్న పంటలు, ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది ద్విచక్ర వాహనంపై పంట పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. 3 గంటలపాటు పంటలను స్వయంగా పరిశీలించారు. పెద్ది వెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు బూస రమ, అశోక్, రమేశ్నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పాల్గొన్నారు.
నెక్కొండ: మండలంలోని నెక్కొండ, సాయిరెడ్డిపల్లె, రెడ్లవాడ, అప్పల్రావుపేటలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పరిశీలించారు. ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీల చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలతో కలిసి పరిశీలించారు. మండలంలో 4,424 ఎకరాల్లో మక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఏవో నాగరాజు ఎమ్మెల్యేకు వివరించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్ది ప్రజలకు సూచించారు.