నర్సంపేటలో ఈ నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నర్సంపేట నియోజకవర్గానికి ఇటీవల మెడికల్ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. రూ. 183 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే చెప్పారు.
రేపు సర్వాపురం శివారులో జిల్లాస్థాయి దవాఖాన భవన నిర్మాణం వద్ద శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించనున్నారు. ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు హాజరు కానున్నట్లు పెద్ది వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నర్సంపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, యువత, మేధావులు, రైతులు, పార్టీలకతీతంగా నాయకులు విజయవంతం చేయాలని కోరారు.