నర్సంపేట, అక్టోబర్ 13: సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట 24వ వార్డుకు చెందిన 12 కుటుంబాలు కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పేదలకు ఆర్థికంగా చేయుతనిచ్చేలా పథకాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. తెలంగాణలో అనేక సాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని వివరించారు. కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతున్నదని కొనియాడారు.
సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతం ఎంతో వెనుకబాటుకు గురైందని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత సాగు, తాగునీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతోపాటు ఎన్నో మెగా ప్రాజెక్టులు నిర్మించారని వివరించారు. దీంతో రా్రష్ట్రంలో నీటి ఇబ్బందులతోపాటు కరెంట్ కష్టాలు తీరాయని పెద్ది చెప్పారు. మరోమారు సీఎం కేసీఆర్ను ఆశీర్వదిస్తే రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకెళ్తుందన్నారు. బీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా నిలుస్తున్నారని కోరారు. నర్సంపేటలో రూ. 50 కోట్ల నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, ఆడిటోరియం, కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరిగినట్లు చెప్పారు. పట్టణ అభివృద్ధిని చూసి వార్డుల్లోని ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన మర్రిపెల్లి రవి, గద్ద రాజేశ్, గద్ద కిట్టు, మేరుగు అన్వేశ్, గద్ద చరణ్, గద్ద క్రాంతి, కల్లెపెల్లి మధు, గంజి రణదీప్, నీరటి భానుకుమార్, బొచ్చు రాజేశ్, దేవరకొండ ప్రవీణ్, అక్కల శివ ఉన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, కౌన్సిలర్ దార్ల రమాదేవి, బీఆర్ఎస్ యూత్ విభాగం నర్సంపేట పట్టణ అధ్యక్షుడు రాయిడి దుష్యంత్రెడ్డి, పెరుమాండ్ల రవి, బొల్లెపెల్లి కమల్కుమార్ పాల్గొన్నారు.