‘రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కాలం చెల్లింది. విపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకా ఎంతోకాలం వారు ప్రజలను తప్పుదోవ పట్టించలేరు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజారిటీతో గెలిపించాలి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు నిండు మనసుతో దీవించాలి.’ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాజుపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్సిడీపై మోటర్లు అందించి రైతుల కళ్లల్లో ఆనందం నింపామన్నారు.
నర్సంపేట రూరల్, మార్చి 29 : అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలకు కాలం చెల్లిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలం రాజుపేట గ్రామ శివారులోని సత్యం ఫంక్షన్ హాల్లో 10 గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి సీఎం కేసీఆర్ను నిండు మనసుతో దీవించి వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
50 ఏండ్లలో అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని గడిచిన 4 ఏళ్లలోనే పక్కా ప్రణాళికతో ప్రగతి బాటలో నిలబెట్టామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల మాటలు అర్థరహితమని, పాదయాత్రలు చేస్తున్న వారికి పచ్చని పంట పొలాలు, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న పల్లెలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. పాలనపై తనకున్న విజన్ నేటిది కాదని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించేది లేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులని, వారి ఆశీస్సులు ఉన్నంత కాలం ఎదురు లేదన్నారు.
4 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న వృద్ధ సింహాలు ప్రస్తుతం నిద్ర లేచి పరుగులు పెడుతున్నాయని, ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఈ ప్రాంతాన్ని అసమర్థుల చేతుల్లో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించి రైతు కళ్లల్లో ఆనందాన్ని నింపామని తెలిపారు. గ్రామాల్లో ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. పార్టీపై, నాయకులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు. పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టు నిర్మాణం తన జీవిత ఆశయమని, ఈ ప్రాంత రైతుల కోసం సీఎం కేసీఆర్ను ఒప్పించానన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోనని 90 శాతం గ్రామాలు గులాబీ పరిమళంతో గుబాళిస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని అందరు ఐక్యతను చాటాలన్నారు. వడగండ్ల బాధితులకు ప్రతి ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు. ప్రతిపక్షాలది అధికార ఆరాటమని, బీఆర్ఎస్ది నిర్విరామ పోరాటమని స్పష్టం చేశారు.
అనేక పైలట్ ప్రాజెక్టులకు నర్సంపేట కేంద్ర బిందువుగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు సబ్సిడీ మోటర్లను అందించి ప్రేమను చాటుకుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నూతన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, క్లస్టర్ బాధ్యులు కొడారి రవన్న, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, భూక్యా వీరన్న, మోతె జైపాల్రెడ్డి, కడారి కుమారస్వామి, కట్ల సుదర్శన్రెడ్డి, తాళ్లపల్లి రాంప్రసాద్, మచ్చిక నర్సయ్యగౌడ్, మోటూరి రవి, సర్పంచ్లు గోలి శ్రీనివాస్రెడ్డి, బానోత్ దస్రూ, మండల రవీందర్, సైద, స్వాతి, సుజాత పాల్గొన్నారు.