నెక్కొండ/ చెన్నారావుపేట, ఆగస్టు 29 : ‘ప్రతి పక్షాల కు అధికారం ఇస్తే వ్యవసాయ రంగాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాయి. ఏమాత్రం ఆదమరిచినా 18శాతం పన్ను వేసే అవకాశం ఉంది’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని అమీనాబాద్, దీక్షకుంటలో పంటనష్ట పరిహారం చెక్కుల ను మంగళవారం వేర్వేరుగా పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2003లో రాళ్లవాన పడి పంటంతా నష్టపోయినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న బలరాంనాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్క పైసా ఇవ్వలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభు త్వం నష్టపోయిన పంటలకు సకాలంలో పరిహారం అం దించి ఆదుకుంటోందన్నారు. ఈ సంవత్సరం అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న పంటను సీఎం కేసీఆర్ సందర్శించి ఎకరాకు రూ.పదివేల చొప్పున పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నియోజకవర్గంలో 42వేల మందికి పరిహారం మంజూరైంద న్నారు. చెన్నారావుపేట మండలానికి రూ.6 కోట్ల సబ్సిడీ, నెక్కొండ మండలానికి రూ.6.26 కోట్ల సబ్సిడీ మంజూరైందన్నారు. అదేవిధంగా రూ.75 కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను 50శాతం సబ్సిడీపై అందించే అవకాశం కూడా కల్పించారన్నారు. రైతన్నల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వల్లే నేడు రెండు పంటలు సాగు చేస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. కాళేశ్వరంతో రెండు పంటల కు పుష్కలంగా నీరందుతోందన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, మద్దతుధర వంటి పథకాలు వారికి అండగా నిలుస్తున్నాయన్నారు. కరోనా సమయంలో ఒక్క ప్రతిపక్ష నాయకుడు ప్రజలను ఆదుకోలేదు. కానీ, తాను ప్రజల మధ్యలో ఉంటూ వారికి అండగా నిలిచానని గుర్తు చేశారు. ఓట్ల కోసం వచ్చే వారి కంటే ప్రజల కోసం పనిచేసే నాయకులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా సీఎం కేసీఆర్కు అండగా నిలవాలన్నారు. దీక్షకుంట క్లస్టర్లోని చంద్రుగొండ, పనికర, ముదిగొండ, దీక్షకుంట గ్రామాల్లోని 1,444 మంది రైతులకు రూ.1,44, 50,000 నిధు లు మంజూరయ్యాయని తెలిపారు.
ఎమ్మెల్యేకు ఘనస్వాగతం : దీక్షకుంట రైతువేదికలో ఏర్పాటు చేసిన పంటనష్టపరిహారాల చెక్కుల పంపిణీ చేసేందుకు గ్రామానికి వచ్చి న ఎమ్మెల్యేకు ప్రజలు, రైతు లు ఘనస్వాగతం పలికారు. దీక్షకుంట క్రాస్ రోడ్డునుంచి దీక్షకుంటలోని రైతువేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజహరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, క్లస్టర్ బాధ్యులు కట్కూరి నరేందర్రెడ్డి, సర్పంచ్ ఆలకుంట సురేందర్, ఎంపీటీసీ ఎల్ అజయ్, మండల నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, టీ శివకుమార్, ఏ చంద్ర య్య, సారంగపాణి, వీరూ నాయక్, ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏవో నాగరాజు, ఏఈవోలు, బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో.. జడ్పీటీసీ పత్తినాయక్, మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫి, పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, క్లస్టర్ బాధ్యులు బాల్నె వెంకన్న, జక్క అశోక్, రాంరెడ్డి, కేతిడి వీరిరెడ్డి, తూటి శ్రీనివాస్, మండల కో ఆప్షన్ గఫ్ఫార్, అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాసరావు, ఏవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.