కరీమాబాద్, మే 14 : సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 38వ డివిజన్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమ అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలసికట్టుగా పని చేద్దాం.. హ్యాట్రిక్ సాధిద్దాం అని పిలుపునిచ్చారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. అందరం కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనపై ప్రజలకు వివరించాలన్నారు. కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకరక్తలు ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, డివిజన్ అధ్యక్షుడు కట్టమల్లు పాల్గొన్నారు.
రైతే దేశానికి వెన్నెముక..
గిర్మాజీపేట : రైతు బాగేంటేనే దేశం బాగుటందని.. రైతే దేశానికి వెన్నెముక అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 28 డివిజన్ హంటర్ రోడ్డులో రైతు సేవా కేంద్రాన్ని కార్పొరేటర్ గందె కల్పనతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సేవా కేంద్రం నిర్వాహకుడు పొన్ను స్వామి, బీఆర్ఎస్ నేతలు గందె నవీన్కుమార్, ముష్కమల్ల సుధాకర్, కార్పొరేటర్ చింతాకుల అనిల్, జడ్ఆర్సీ మెంబర్ చింతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నేతన్నల అభ్యున్నతికి కృషి..
పోచమ్మమైదాన్ : నేతన్నల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. కొత్తవాడలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్లో శనివారం రాత్రి చేనేత సంఘాల అధ్యక్షులు, కార్మికులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నేతన్నలకు పూర్తిస్థాయి భరోసా దొరుకుతుందన్నారు. పేద నేతన్నలకు డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి, ఇతర పథకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. 2100 మంది నేతన్నలకు ప్రత్యేక వైద్య సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
చేనేత బీమా సదుపాయం లేని పద్మశాలీలకు తాను సొంతంగా లేబర్కార్డు అందిస్తామని తెలిపారు. మెగా టెక్స్ టైల్స్ పార్క్లో మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొత్తవాడలో యెలుగం వీరస్వామి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ, సంఘాల ప్రతినిధులు యెలుగం చిన కొమురయ్య, కొలిపాక మదనయ్య, వెంకటమల్లు, శ్రీనివాస్, చిన్న భద్రయ్య, కుమారస్వామి, రాజేందర్, రమేశ్, రవి, సాంబయ్య, ఓం ప్రకాశ్, సారయ్య, రాజమౌళి, రాంచందర్, వీరస్వామి, ఐలయ్య, లక్ష్మి, లత, పోశాలు, చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, డీఎంవో కృష్ణ హరి, డీవో బొట్టు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.