లింగాల గణపురం : అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల నుంచి భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా ఒక్కొక్కరు చేతులెత్తేస్తున్నారు. తాజాగా జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రైతులకు ఖరీఫ్లో నీళ్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
గోదావరి ( Godavari ) కి నీటి ప్రవాహం అంతంత మాత్రమే ఉంది. నదిలో సరిపడా నీళ్లు లేవు. చెరువుల్లోకి ఎత్తిపోయలేమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( MLA Kadiyam Srihari ) తెలిపారు. లింగాల గణపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా తనకెంతో అనుభవం ఉన్నదని వెల్లడించారు. నదిలో ఎత్తిపోసేటంత ప్రవాహం లేదన్న విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. రైతులు గమనించి వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని కోరారు.