కాజీపేట, అక్టోబర్ 28 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న రాబందులను ప్రజలు ఇంటికి రానివ్వొదని పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాజీపేటలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, రాష్ర్టాన్ని నంబర్ వన్గా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని సైతం అవహేళన చేస్తూ పబ్బం గడుపుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామ రక్ష అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఏం అభివృద్ధి చేశాయో ప్రజలకు చెప్పలేని స్థితిలో ఇక్కడి నాయకులు ఉన్నారన్నారు. నియోజకవర్గంలోని వాడల్లో ప్రతిపక్ష నాయకులను తిరుగకుండా చేయాలన్నారు. వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఓటర్లు అవగాహనతో ఆలోచించి, ఓటు వేయాలని కోరారు. ఎన్నికలు అనగానే ఎక్కడైనా నాయకుడి నుంచే డబ్బులు తీసుకుంటారని, అదే నాయకుడికి తిరిగి ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చే సంప్రదాయం తన నియోజకవర్గంలో ప్రజలకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిగా ఉంటానన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ భారీ మెజార్టీతో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు. నవంబర్ 30న జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటా
బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు అండగా ఉంటూ, కంటికి రెప్పలా కాపాడుకుంటానని నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ బాపూజీనగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల విజయ్ తన వంద మంది అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ చీఫ్విప్ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, డివిజన్ అధ్యక్షడు, దువ్వ కనకరాజు, ఇన్చార్జి శిరుమల్ల దశరథం, అఫ్జల్, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, నయీం జుబేర్, మర్యాల కృష్ణ, సిరిల్ లారెన్స్, ఫర్హాన్, గబ్బెట కరుణ్, నరేశ్, శంకర్, పోతుల సాంబయ్య, కొంపెల్లి లక్ష్మణ్, ఫర్వీన్, కొలిపాక శివకుమార్ పాల్గొన్నారు.
వినయ్భాస్కర్కు కాజీపేట వ్యాపారుల మద్దతు
కాజీపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ను ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వర్తక వాణిజ్య, వ్యాపారులు శనివారం మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు వ్యాపారులు తీర్మానం చేశారు. వినయ్భాస్కర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మూకుమ్మడిగా వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తన గెలుపు కోసం సంపూర్ణ మద్దతును ప్రకటించిన ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు, వర్తక వాణిజ్య, వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నియోజక వర్గంలో బరిలో ఉన్న తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్, కిరాణం జనరల్ స్టోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెనివెట్టి రఘు, కిరాణం అధ్యక్షుడు కల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎలుగూరి వేణుగోపాల్, కోశాధికారి మహేందర్, యాదగిరి, తోట శివాజి, రంజిత్, విజయ్, దీప్, జవాన్ దేశాయ్, వ్యాపారులు పాల్గొన్నారు.