ఎన్నికల ప్రచారం పరకాల, నవంబర్ 22 : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పేదప్రజలను పట్టించుకున్న వారే లేరని, మళ్లా కాంగ్రెస్కు ఓటేస్తే ఆకలి బతుకులే మిగులుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 3,4,16,17,18,19, 20వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లాకు మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని, గడపగడపకూ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన కొన్నేండ్లలోనే దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఇక్కడి పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. దేశానికే అన్నం పెట్టే దిశగా రైతన్నలు దిగుబడులు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
కాగా, ఉమ్మడి రాష్ట్రంలో పరకాలలో రోడ్లు గుంతలమయంగా ఉండేవన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పరకాల రెవెన్యూ డివిజన్ను పునరుద్ధరించామని, అంతర్గత రోడ్లు, మౌలిక వసతులను కల్పించుకున్నామని తెలిపారు. ప్రధాన రహదారులను విస్తరించుకుని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నామని, పాలనా భవనాలను కార్పొరేట్ స్థాయిలో నిర్మించుకున్నట్లు చెప్పారు. వంద పడుకల దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే నట్టేట మునగడం ఖాయమన్నారు. పరకాలను అన్ని విధాలా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు అండగా నిలువాలని కోరారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత-రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, చల్లా జ్యోతి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, కౌన్సిలర్లు పోరండ్ల సంతోష్, బండి రమాదేవి, పాలకుర్తి గోపి, ఏకు రాజు, నాయకులు బండి సారంగపాణి, చందుపట్ల తిరుపతిరెడ్డి, పావుశెట్టి వెంకటేశ్వర్లు, దగ్గు విజేందర్రావు, పాడి భగవాన్రెడ్డి, దామ అనిల్, మార్క రఘుపతి, శనిగరం నవీన్ పాల్గొన్నారు.