పరకాల, నవంబర్ 9 : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా సీఎం కేసీఆర్ అమలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందాయని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వృద్ధులు, ది వ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విపక్షాల నాయకులు ప్రజలను మోసం చేసేందుకు అసత్య హా మీలు ఇస్తున్నారని విమర్శించారు. విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న సమయంలో ఏ నాడు తెలంగాణ గురించి ఆలోచించలేదని విమర్శించారు. గ్రామాల్లో క్యాడర్ లేని బీజేపీ ప్రజల మధ్య మతం, కులం పేరుతో చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదన్నా రు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత-రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గీసుగొండ/ఆత్మకూరు/సంగెం : గీసుగొండ, ఆత్మకూరు, సంగెం మండలాల్లోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆల యం, వేణుగోపాలస్వామి ఆలయం, సంఘమేశ్వరాలయం లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను స్వామి వార్ల పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, మండలాధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి, పసునూరి సారంగపాణి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, సర్పంచ్లు అంకతి నాగేశ్వర్రావు, వాంకుడో త్ కవిత, కేలోత్ సరోజన, దౌడు బాబు, ఆలయ చైర్మన్ గడ్డమీది కుమారస్వామి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి అజార్, నాయకులు సుంకరి శివకుమార్, శ్రీనివాస్రెడ్డి, వీరాటి రవీందర్రెడ్డి, బాలరాజు, బాబు, ఎల్లాస్వా మి, భూక్యా అఖిల్, బానోత్ వీరన్న, చంద్రారెడ్డి, మండల రవి, ప్రమోద్, అభిషేక్, గుగులోత్ రాజు, సునీల్, రమేశ్, రవి, మోతీలాల్, వంశీ, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పాపని రవీందర్, ఎండీ అంకుస్, వంగాల భగవాన్రెడ్డి, వీర్ల వెంకటరమణ, రేవూరి ప్రవీణ్రెడ్డి, రేవూరి జ యపాల్రెడ్డి, బైగాని రాజేందర్, పసునూటి దేవేందర్, కొ మ్ము పూర్ణచందర్, కందకట్ల నరహరి, తాటికొండ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.