సంగెం, మార్చి 20 : రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని వంజరపల్లి, పల్లార్గూడలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న, వరి, మిర్చి పంటలను సోమవారం పరిశీలించారు. పంట నష్టపరిహారంపై సీఎం కేసీఆర్తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాన్నారు. గాలులకు రేకులు ఎగిరిపోయిన రాజరాజేశ్వర మాడ్రన్ రైసు మిల్లు గోదామును పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ కౌడగాని శంకర్రావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, ఏవో యాకయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానందం, సర్పంచ్లు కక్కెర్ల కుమారస్వామి, బిచ్చానాయక్, ఎంపీటీసీ గుగులోత్ వీరమ్మ, నాయకుడు కక్కెర్ల సదానందం, ఉప సర్పంచ్ రఘు, పెంతల అనిల్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం..
గీసుగొండ : వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే చల్లా అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 11,500 ఎకరాల్లో మక్కజొన్న పంట దెబ్బతిన్నదన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, తప్పక ఆదుకుంటారన్నారు. 55 ఎకరాల్లో పండ్ల తోటలు, 763 ఎకరాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయన్నారు. అధికారులు పంట నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వనారాయణ, ఏవో హరిప్రసాద్బాబు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్లు పూండ్రు జైపాల్రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, ఎంపీటీసీ వీరారావు, సొసైటీ చైర్మన్లు రడం శ్రీధర్, వీరస్వామి, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు చిన్ని, రడం భరత్, వెంకటేశ్వర్లు, ప్రమోద్, వీరన్న, రాజేందర్ పాల్గొన్నారు.