ములుగు, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క ములుగు జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ పోలీస్ అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతిని అగౌరవపరిచారు. సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి జడ్పీటీసీగా ఉన్న నాగజ్యోతి జడ్పీ చైర్ పర్సన్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
ఇటు జడ్పీటీసీగా, అటు జడ్పీ చైర్పర్సన్గా శిలాఫలకంపై పేరు లేకపోవడంపై అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారి సీఎస్ఆర్ ఫండ్తో ఈ భవనాన్ని నిర్మించగా ములుగు జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభోత్సవం మంత్రి సీతక్క నిర్వహింపజేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనలో ప్రొటోకాల్పై అధికారులు నిర్లక్ష్యం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.