Medaram Trust | ములుగు, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మేడారం ట్రస్ట్బోర్డు సభ్యులను మంత్రి సీతక్క ఖరారు చేసి జాబితాను దేవాదాయ శాఖకు పంపారు. ఆ శాఖ ఆమోదం పొందాక నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ట్రస్ట్బోర్డు చైర్మన్గా అర్రెం లచ్చుపటేల్తోపాటు మరో 13మంది సభ్యులు నియామకం కానున్నారు. సభ్యులుగా ముంజాల భిక్షపతి గౌడ్, మిల్కూరి ఐలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణసింగ్, సుంచ హైమావతి, చామర్తి కిశోర్, కోరం అబ్బయ్య, ఆలెం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామిని నియమించనున్నారు.. ఎక్స్ అఫీషియో మెంబర్గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఖరారయ్యారు. దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాత వీరు మేడారంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.