మహబూబాబాద్, నవంబర్ 23 : దివ్యాంగులతో మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ శశాంక మమేకమయ్యారు. వారితో కలిసి క్యారమ్స్, చెస్, త్రోబాల్, జావెలిన్ త్రో తదితర ఆటలు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. దీంతో అక్కడున్న క్రీడాకారులంతా ఉల్లాసంగా ఆటలాడుతూ కనిపించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 120మంది దివ్యాంగులు, వయో వృద్ధులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి హాజరై జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేయూత నందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, ఇతరులకు రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 పెన్షన్ను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. దివ్యాంగులకు అండదండలు అందించడం సీఎం కేసీఆర్ అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తామే నిలబడాలని కోరుకోవడం వారిలో ఉన్న ఆత్మైస్థె ర్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తూ ఐదు లక్షల మందికి పింఛన్ల రూపంలో అంది స్తోందన్నారు. జిల్లా మంత్రిగా తనకు చేతనైన సాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. క్రీడలకు అయ్యే ఖర్చును కలెక్టర్ ఆధ్వర్యంలో భరిస్తామని వివరించారు. తన వంతుగా రూ.25వేలు సాయం అందిస్తు న్నట్లు ప్రకటించారు. సుమారు 400మంది దివ్యాంగులు క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ క్రీడల్లో 44మందిని ప్రథ మ, ద్వితీయ స్థానంలో ఎంపిక చేశారు. వీరికి డిసెంబర్ 3న ది వ్యాంగుల దినోత్సవం రోజున బహుమతులను అందజేయనున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంక, జిల్లా సంక్షే మాధికారిణి నర్మద, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సుంక రనేని నాగవాణి పాల్గొన్నారు.
పరుగు పందెం పోటీలో పాల్గొన్న దివ్యాంగులు