హనుమకొండ, ఫిబ్రవరి 22 : ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలానికి రానున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందించడం కోసం రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన విజయవం తం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్లు సంపత్రెడ్డి, సుధీర్కుమార్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం కోసం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. జన సమీకరణపై చర్చించారు.
మండలాల వారీగా ఇన్చార్జులు
జఫర్గఢ్ మండలానికి మార్నేని రవీందర్రావు, స్టేషన్ ఘన్పూర్కు ఎమ్మె ల్సీ బస్వరాజు సారయ్య, రఘునాథ్పల్లికి రైతు రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, లింగాల ఘనపురానికి అర్అండ్బి అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ధర్మసాగర్కు కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వేలేరుకు దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి, చిల్పూర్కు జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, భీమదేవరపల్లికి హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ను నియమించారు. అలాగే కార్యక్రమ సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య వ్యవహరిస్తారు.
27న సోడాషపల్లికి కేటీఆర్..
వేలేరు : మండలంలోని సోడాష పల్లికి ఈనెల 27న మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు నీరందించే పైపులైన్ పనులను శంకుస్థాపన చేయనున్నారు. సోడాషపల్లి గ్రామశివారులో రైతు కృతజ్ఞతా సభలో పాల్గొననున్నారు. ఈమేరకు బుధవారం స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజ య్య, సీపీ సీవీ రంగనాథ్ సభా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. 133 కోట్ల అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా చే యాలని అధికారులకు సూచించారు. స భ విజయవంతానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని కోరా రు. జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, పాగాల సంపత్రెడ్డి, ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కాలేరు కరంచంద్ పాల్గొన్నారు.