ములుగుటౌన్, జూన్5: రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాకు రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సో మవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ మాలోత్ కవితతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు ములుగు జిల్లా కేంద్రంలో రూ. 65 కోట్లతో కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కా ర్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 30 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణా నికి శంకుస్థాపన, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రా రంభోత్సవం చేనున్నారని తెలిపారు.
సాగు నీటి దినోత్స వం సందర్భంగా రామప్పలో గోదావరి జలాలకు పూజలు చేయనున్నారని చెప్పారు. రామప్ప రిజర్వాయర్ పూర్త యిన నేపథ్యంలో ఇరిగేషన్ చెరువుల ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యునెసో గుర్తింపుకు కేటీ రామారావు ఎంతో కృషి చేశారని అన్నారు. జిల్లా కేంద్రం లోని సాధన హై సూల్ పకన ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, సుమారు పదివేల మందిని తర లించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఐకేపీ మహిళలకు వడ్డీ లేని రుణాలు చెకుల పంపిణీ చేయనున్నట్లు, అదే విధంగా గొల్ల కురుమలకు రెండో విడుత 125 యూనిట్లు గొర్రెల పంపిణీ పంపిణీ చేయనున్నారని తెలిపారు.
కేటీఆర్ పర్య టన నేపథ్యంలో జడ్పీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధికార ప్రజాప్రతినిధులు బహిరంగ సభ విజయవంతా నికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆమె కోరారు. ఎండా కాలం కాబట్టి 10 గంటల లోపే ప్రజలను తరలించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చూడాలని సూచించారు. మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని, కేటీఆర్ తెలంగాణకు ఎన్నో ఐటీ కంపెనీలు తెస్తున్నారని ఆయన వివరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఈ నాగేశ్వర్ రావును మంత్రులు సన్మానించారు. సమావేశం లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, ఇరిగేషన్ ఈఈ విజయభాస ర్, డీఆర్డీవో నాగపద్మజ, జడ్పీ సీఈవో ప్రసన్నా రాణి, డీపీ వో వెంకయ్య, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డీపీవో సర్దార్ సింగ్, పశు వైద్య అధికారి విజయభాసర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ములుగు,జూన్5(నమస్తేతెలంగాణ)/ములుగు రూర ల్/వెంకటాపూర్: ములుగు జిల్లాలో ఈనెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటనను పురసరించుకొని చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. సోమవారం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ఆలం, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులతో మంత్రి సమీక్షించారు. అకడ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన హెలిప్యాడ్ను పరిశీలించారు. పక్కనే ఉన్న సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను సందర్శించారు. మాధవరావు పల్లె వద్ద నిర్మించిన శ్మశానవాటిక, మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, బండారుపల్లి గ్రామ శివారులో నిర్మిం చే సేవాలాల్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
సభా స్థలిని పరిశీలించిన ఎర్రబెల్లి
7వ తేదీన కేటీఆర్ పర్యటన సందర్భంగా ములుగులో నిర్వహించే బహిరంగ సభాస్థలిని జడ్పీచైర్మన్ జగదీశ్వర్, ఎంపీ కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ఆలంతో కలి సి మంత్రి ఎర్రబెల్లి పపరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సభను విజయవంతం చేయాలన్నారు.
రామప్పలో..
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో రామప్ప దేవాల యం, సరస్సును జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ గౌస్ఆలం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు దేవాలయ ప్రాంగణం, చెరు వు కట్ట తూములు, హెలిప్యాడ్, పార్కింగ్, వేదిక తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లపై అధికారులతో కలిసి చర్చిం చారు. ఆయా కార్యక్రమాల్లో ఓఎస్డీ అశోక్కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, గ్రంథాలయ చైర్మన్ గోవింద్నాయక్, జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, జిల్లా నాయకులు మల్క రమే శ్, పోశాల వీరమల్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.