హనుమకొండ, మే 27 : రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఈనెల 31న వరంగల్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, అదే రోజు జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంత్రి హరీశ్రావు పర్యటన నేపథ్యంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్తో హనుమకొండలోని క్యాంపు కార్యాలయం(ఆర్అండ్బీ అతిథి గృహం)లో శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. పర్యటన సందర్భంగా చేపట్టనున్న ఆయా కార్యక్రమాల వివరాలు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, ఆ రోజు జరిగే వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.