నెక్కొండ, జనవరి 27 : సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానుభావుడని, రైతులు ఏటా మూడు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని రెడ్లవాడలో సాయిరెడ్డిపల్లె వరకు రూ .12కోట్ల నిధులతో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, జీపీ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత కరంట్ అందించడంతో పాటు రైతు బంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పుష్కలంగా సాగు నీరందించడంతో రైతన్నలు రెండు పంటలు పండించుకొంటూ ఆనందంగా ఉంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే పల్లెలు సమగ్రంగా అభివృద్ధి చెందాయన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్ను, ఎమ్మెల్యేలను కాపాడుకుంటేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుందన్నారు.
మారుమూల పల్లెలకు చక్కని రోడ్లు : ఎమ్మెల్యే పెద్ది
ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మారుమూల పల్లెలన్నింటికీ చక్కని రోడ్లు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పథకం అర్హులకు అందుతోందన్నారు. పల్లెలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గ్రామంలో పల్లె దవాఖానను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజన, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, రెడ్లవాడ, నెక్కొండ సొసైటీల చైర్మన్లు జలగం సంపత్రావు, మారం రాము, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్ రావుల శ్రీలత, మాజీ సర్పంచ్ అన్నమనేని సంతోష్, సొసైటీ మాజీ చైర్మన్లు ఆవుల చంద్రయ్య, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, గాంధీ, తాటిపల్లి శివకుమార్, ఉప సర్పంచ్ బర్ల వీరభద్రయ్య, గ్రామ అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.