తొర్రూరు, జనవరి 19: వ్యాపారం చేసుకునే వారికి చాతనైన ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఎంతో మందికి బాసటగా నిలిచానని, వ్యాపారంలో ఎదిగిన వారిని బెదిరింపులకు గురిచేయడం, ఇబ్బందులు పెట్టడం తన రాజకీయ జీవితంలో లేదని అందుకే ఇన్నేళ్లు మీ ఆదరణతో గెలుస్తూ వస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ తొర్రూరు ఆధునీకరణ భవనం, ఫంక్షన్హాల్ను గురువారం అధ్యక్షుడు మచ్చసురేశ్తో కలిసి ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వ్యాపారులు రాజకీయాలతో సంబంధ లేకుండా వాణిజ్యపరంగా రాణిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
మడిపల్లి శివారులో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం పరిశ్రమల శాఖకు 80 ఎకరాల స్థలాన్ని ఇవ్వగా, అనేక మంది వ్యాపారస్తులు ముందుకురావడం అభినందనీయమని, త్వరలోనే అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. పంట మార్పిడితో వాణిజ్య, ఆర్థికపరమైన ప్రయోజనం ఉండాలనే లక్ష్యంతో ఆయిల్పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హరిపిరాల వద్ద ఏర్పాటు చేసిన పెద్ద నర్సరీకి తోడుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయిల్పామ్ ఫ్యాక్టరీని గోపాలగిరిలో ఏర్పాటు చేయబోతున్నామని, దీంతో తొర్రూరులో వ్యాపార రంగానికి మరింత ఊతం వస్తుందని చెప్పారు. గతంలో రూ.10లక్షల మేర అభివృద్ధి నిధులు ఇచ్చానని, ఇప్పుడు ఆధునీకరించిన భవనం అద్భుతంగా ఉందని, వరంగల్ వంటి నగరాలకు తీసిపోకుండా భవనాన్ని, ఫంక్షన్హాల్ను అభివృద్ధి చేసిన అధ్యక్షుడు మచ్చ సురేశ్, కార్యవర్గం, దాతలను అభినందించారు. ఇంకా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు మచ్చ సురేశ్, ప్రధాన కార్యదర్శి బోనగిరి శంకర్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్రెడ్డి, జిల్లా సభ్యుడు రామసహాయం కిశోర్రెడ్డి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కౌన్సిలర్ తూర్పాటి సంగీతారవి, సలహా కమిటీ ప్రతినిధులు, చాంబర్ కార్యవర్గ ప్రతినిధులు పంజాల ఉపేందర్, అనుమాండ్ల మోహన్రెడ్డి, రేవూరి నర్సయ్య, చక్రపాణి, రేవూరి వెంకన్న, మచ్చ లక్ష్మయ్య, గౌరీశంకర్, ప్రతాపని వెంకటేశ్వర్లు, గుండాల నర్సయ్య, సత్యనారాయణ, విజయపాల్రెడ్డి, అశోక్, చంద్రమౌళి, సోమ య్య, రేవూరి శ్రీధర్, చిదిరాల రవి, యాదరిగి, బోనగిరి వెంకటేశ్వర్లు, వనమాల ప్రకాశ్, రాంబాబు, తమ్మె ర రామారావు, శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు.