వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో వినాయక మండపాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. శ్రీ వేణుగోపాలస్వామి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడుకి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం కరువు, కరువు కాటలకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.