రాయపర్తి, జూన్ 2: దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా సన్నూరు గ్రామాన్ని సందర్శించిన ఆయన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల్లో నిర్వహిస్తున్న ఐకేపీ, స్త్రీనిధి మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం మహిళలతో మాట్లాడుతూ కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని ఆర్అండ్ ఆర్ కాలనీలోని మొరిపిరాల రైతు వేదిక భవనం వద్ద జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, శిరీష పాల్గొన్నారు.