పాలకుర్తి రూరల్, మే 29 : సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి, దర్దేపల్లి, టీఎస్కే తండా, కొండాపురం, పెద్దతండా కే లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు పాలకుర్తిలో రూ.30లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. పోచమ్మ దేవాలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వారి కుట్రలు, కుంతంత్రాలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కుల వృత్తుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించిందన్నారు. యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే దేవాలయాలకు పూర్వ వైభవం సంతరించుకుందని, బమ్మెర, వల్మిడి, పాలకుర్తిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. పాలకుర్తికి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను మంజూరు చేశానని, త్వరలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. పాలకుర్తి, చెన్నూరు, ఉప్పుగల్లు రిజర్వాయర్లను త్వరలో పూర్తి చేస్తానన్నారు. రైతు బంధు పథకంతో రైతులు రాజులుగా మారారని అన్నారు. రైతులు పండించిన పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటున్నదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఇందు కు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేసి పేదల పొట్టగొడుతున్నదన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, ఒకో గ్రామంలో రూ.కోటి మేర నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అని, నిత్యం ప్రజల కష్ట సుఖా ల్లో పాలు పంచుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లిపై కొందరు బుద్దిలేని వారు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని చెప్పారు. డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతోపాటు మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేస్తున్నాడని అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హయాంలో పా లకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, పంజా కల్పన, మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, ఇమ్మడి ప్రకాశ్, ధరావత్ బాలూనాయక్, శాంత మ్మ, ఎంపీటీసీలు మంద వీరలక్ష్మి, ఎడవెల్లి పురుషోత్తం, జడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు మదా ర్, సర్వర్ఖాన్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రాం చంద్రయ్యశర్మ, ముస్కు రాం బాబు, మాచర్ల ఎల్లయ్య, అశోక్రెడ్డి, రాఘవరావు, భూ మ రంగయ్య, జలగం అంజయ్య, కర్ణాకర్రెడ్డి, గడ్డం కిరణ్, లలితాదేవేందర్, సోమేశ్వర్రావు, వర్రె వెంకన్న, రవీందర్ పాల్గొన్నారు.