తొర్రూరు, మే 14 : సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ క్రేందంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్, స్థానిక హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మనిషిని సమానంగా గౌరవించాలన్నదే అన్ని మతాల విధానమని, అదే సమున్నత మానవత్వమని, ఆ మానవీయతను ప్రపంచానికి చాటాలని చెప్పారు. మన మత గౌరవాన్ని నిలుపుకోవాలంటే పరమత సహనాన్ని పాటించాలని సూచించారు. దైవభక్తి సమాజంలో ప్రశాంతతను చాటుతుందని, అందుకే రాజకీయాలకతీతంగా ప్రజల్లో భక్తి భావాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.
అయోధ్య, భద్రాద్రికి ఉన్నంత చరిత్ర పాలకుర్తికి ఉందని, పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి గ్రామంలో రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మునుల గుట్టపై తపస్సు చేశాడని, ఆ పకనే ఉన్న మరో గుట్టపై నుంచి రాముడు నడయాడినట్లు చరిత్ర చెబుతున్నదన్నారు. ఆ వైభవాన్ని నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఆనాటి పురాతన రామాలయాన్ని పునర్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆదికవి సోమనాథుడి స్వగ్రామం పాలకుర్తిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆ పకనే ఉన్న సహజకవి, భాగవత రచయిత పోతన పుట్టిన బమ్మెర గ్రామాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, రామాలయంతోపాటు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాసర తరహా అక్షరాభ్యాస కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని అనేక పురాతన దేవాలయాలకు పూర్వవైభవం తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఇకడి ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిద్ధయోగి శ్రీస్వామి చైతన్య ఆనంద మాట్లాడుతూ..
హనుమంతుడు ధైర్యం, సాహసానికి ప్రతీక అని, రాముడు గుణగణాలలో గొప్పవాడని, ఈ రెండు లక్షణాలను ప్రతి ఒకరూ పుణికి పుచ్చుకోవాలన్నారు. అప్పుడే దేశంలో రామరాజ్యం వస్తుందని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారని చెప్పారు. పరమత సహనాన్ని పాటిస్తూ, హిందూమత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలన్నారు. బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, స్థానిక హనుమాన్ దేవాలయ కమిటీల అధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర తొర్రూరులో పాటిమీద ఆంజనేయస్వామి దేవాలయం నుంచి దుబ్బతండా హనుమాన్ గుడి మీదుగా పాల కేంద్రం హనుమాన్ గుడి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, కౌన్సిలర్లు, శోభాయాత్ర కన్వీనర్ కొల్పుల శంకర్, కో కన్వీనర్ అనుమాండ్ల ప్రదీప్రెడ్డి, చలువాది సత్యనారాయణ, కృష్ణమోహన్, విజయభాస్కర్, శివకుమార్, పృథ్వీరాజ్, దేవరకొండ కృష్ణప్రసాద్, కస్తూరి పులేందర్, ఇమ్మడి రాంబాబు, ఎనగందుల సంతోష్, సాయిముఖేశ్, విశ్వహిందూ పరిషత్, భరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్రెడ్డి, శివరాంతోపాటు వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ తక్కళ్లపల్లి రవీందర్, హనుమాన్ భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.