‘మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నారు. దీంతో వారి ప్రాధాన్యత పెరిగింది’ అని మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం మహిళా సంక్షే మ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు అందజేస్తూ సర్కారు పెద్దన్నగా ఆదుకుంటోందని అన్నారు. గతంలో మహిళలు తాగు నీటికి ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటినిచ్చి వారి కష్టాలు తీర్చారన్నారు.
– హనుమకొండ, జూన్ 13
హనుమకొండ, జూన్ 13: మహిళా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ ఉమ్మడి డీసీసీబీ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యక్షతన మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులను, డీసీసీ బ్యాంకు మహిళా ఉద్యోగులను ఘనం గా సన్మానించారు. అలాగే, రూ.63లక్షల ఇన్సెంటీవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ గత పాలకులు మహిళలను పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. తెలంగాణలో అన్ని స్థాయిల పోస్టుల్లో మహిళా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారన్నారు. మహిళలు అర్థికంగా బలపడితే ఆయా కుంటుంబాలు బాగుపడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఇస్తూ పెద్దన్నగా ఆదుకుంటోదన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ తకువ ఉండేదని, ఇప్పుడు 50 శాతం పెరిగిందన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలువడం గర్వకారణమన్నారు. మహిళలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు. మహిళలకు గొప్పగా తమ రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి పేరొన్నారు. గతంలో కరువుకాటకాలతో ఇబ్బంది పడుతూ మహిళలు తాగు నీటికి బిందెలు పట్టుకొని వెళ్లేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించి, మహిళల కష్టాలు తీర్చారన్నారు. నష్టాల్లో ఉన్న డీసీసీబీని చైర్మన్, ఉద్యోగులు కలిసి లాభాల బాటలోకి తీసుకొచ్చారన్నారు. రూ.850కోట్ల టర్నోవర్ నుంచి రూ.1700 కోట్లకు చేరుకోవడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన చైర్మన్, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.
రూ.110 కోట్లు మహిళా సంఘాలకు అందించడం గొప్ప విషయమన్నారు. డీసీసీబీలో డిపాజిట్లను ప్రోత్సహించాలన్నారు. ప్రతి పథకంలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు మరింత అభివృద్ది బాటలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్కు అండగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. డీసీసీ బ్యాంకులో సుమారు 120 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఇచ్చిన రుణాలపై వచ్చిన లాభాన్ని ఇన్సెంటివ్గా ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతు కుటుంబాల్లోని పిల్లల విదేశి విద్యకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే, మహిళలకు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జగన్మోహన్రావు, ప్రజాప్రతినిథులు, జిల్లాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, జిల్లా, మండల సమాఖ్య సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.