రాయపర్తి, నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలోని పడావుపడ్డ భూముల్లో ఇప్పుడిప్పుడే సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగా పసిడి పంటలు పండించుకుంటున్నామని బీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శుక్రవారం మండలంలోని తెట్టెకుంటతండా, తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్పల్లి, కాట్రపల్లి, కిష్టాపురం, మొరిపిరాల, మహబూబ్నగర్ గ్రామాల్లో బుల్లితెర ఆర్టిస్ట్లు, రేలారేరేలా ఫేమ్ గంగ, ఫోక్ సింగర్ గొట్టె కనకవ్వ, జబర్దస్త్ ఆర్టిస్ట్ రాజమౌళి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి బృందానికి గ్రామ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల సారథ్యంలో డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి కాలినడకన తిరుగుతూ కారుగుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం నిర్వహించిన ప్రచార సభల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సీమాంధ్ర పాలకుల వివక్షకు గురై అభివృద్ధిలో అట్టడుగున ఉండిపోయిందన్నారు.
సాగునీరు లేక పడావుపడి భూముల్లో పల్లేర్లు మొలిచాయన్నారు. దీంతో ప్రజలు పొ ట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లారన్నారు. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతోందన్నారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం, ఎ స్సారెస్పీ కాలువల ద్వారా అందుతున్న సాగు నీటితో మం డలంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయన్నారు. దీంతో గ్రామాలు పచ్చని పంటలతో కోనసీమను తలపిస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ పాలనే సంపూర్ణ రక్షణ అని చె ప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ బంగారు తె లంగాణ దిశగా పయనిస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న మోసపూరిత మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. అనంతరం మండలంలోని తి ర్మలాయపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, కొండూరులోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
మండల కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన మండల సీనియర్ జర్నలిస్ట్ వలబోజు రవీందర్ కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి కలిసి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిం చారు. కుటుంబానికి అ న్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జి నుగు అనిమిరెడ్డి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకు ల సురేందర్రావు, మండల నాయకులు గుడిపూడి గోపాల్రావు, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, సర్పంచులు, ఎంపీటీసీలు గారె నర్సయ్య, అయిత రాంచందర్, బిల్ల రాధిక సుభాష్రెడ్డి, గజవెల్లి అనంత ప్రసాద్, కర్ర సరితారవీందర్రెడ్డి, చిర్ర ఉపేంద్ర, కుక్కల భాస్కర్, సూదుల దేవేందర్రావు, బోనగిరి ఎల్లయ్య, సంకినేని ఉప్పలమ్మ, అండ్రెడ్డి యాదమ్మ, గాదె హేమలతారవీందర్రెడ్డి, భూక్యా క్రాంతి, చిక్కొండ రజితావీరస్వామి, మహ్మద్ నయీం, వనజారాణి, మహ్మద్ అక్బర్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్యాదవ్, పాల్వంచ కోటేశ్వర్, తౌడిశెట్టి రామారావు, పురం అనిల్కుమార్, చిన్నాల ఉప్పలయ్య, బందెల బాలరాజు, జక్కుల వెంకట్రెడ్డి, గట్టు నర్సింహాచార్యులు, ఉబ్బని సింహాద్రీ తదితరులు పాల్గొన్నారు.