కాంగ్రెస్ నాయకులుపెద్దవంగర, అక్టోబర్19 : బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు గ్రామాల్లో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. 60 ఏండ్ల పాలనలో కరెంటు కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలన్నారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధిని.. రాక ముందు పరిస్థితులను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ సహకారంతోనే పుష్కలంగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలా డెవలప్ చేశానన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓటమి భయంతోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ప్రతి కార్యాలయం వద్ద బ్రోకర్లు ఉండేవారని, అలాంటి వ్యవస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే దమ్మూ..ధైర్యం సీఎం కేసీఆర్కే ఉందన్నారు.
‘రేవంత్రెడ్డి.. నువ్వు ఓ 420వి.. దద్దమ్మవు.. నీ లా గా బ్రోకర్ మాటలు నాకు రావు. ప్రజలు నన్ను నమ్మి ఏడు సార్లు గెలిపించారు. నువ్వు ఒకసారి పోటీ చేసిన కాడ మళ్లీ పోటీ చేయవు. ఎందుకంటే ఓడిపోతాననే భయం.. నువ్వో చిల్లర గాడివని దేశమంతా అం టోంది. నీ మాటలు ఎవరూ నమ్మరు. నీ పార్టీ వాళ్లే ని న్ను తిడుతున్నరు.. రూ.10 కోట్లు, రూ.20 కోట్లకు టికె ట్లు అమ్ముకున్నవు.. నువ్వొచ్చినంకనే కాంగ్రెస్ నాశనమైందని మీ పార్టీ వాళ్లే అంటున్నరు’ అని మంత్రి ఎర్రబెల్లి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చినోడు రాసేస్తే నువ్వు చదువుతున్న రాహుల్గాంధీ.. నీకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం తెలుసు?, సింగరేణి గురించి ఏం తెలుసు?, మీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎకడైనా కట్టారా…?, కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ కూడా నీకు తెలియదు.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?, ఎవరో రాసిస్తే మాట్లాడటం కా దు. ఇకడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడు’ అని రాహులగాంధీ వ్యాఖ్య విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డికి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే గుణపాఠం చెప్పే రోజలు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఎన్నికల టూరిస్టులను నమ్మొద్దు
ఎన్నికల టూరిస్టులను నమ్మొద్దని, గ్రామాల్లోకి వచ్చే వారికి తగిన గుణపాఠం చెప్పి పంపాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ సుధాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులను కంటికి రెప్ప లా కాపాడుకుంటానని, కష్టపడి పనిచేసిన నాయకు లు, కార్యకర్తలకు భవిష్యత్లో ప్రత్యేక స్థానం ఉం టుందన్నారు. సీఎం కేసీఆర్తోనే ప్రతి పల్లె, తండా అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం ఉప్పరగూడెం, వడ్డెకొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు బైన రామూజ్యోతి, ము స్కు అశోక్అశ్విని, సాంబరాజు, గ్యార వెంకన్న, దుం పల రఘు, మద్దెల శోభన్బాబు, పల్లె రాజు, దంతాలపల్లి సుందర్ బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి, సు ధాకర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి గోపాల్రావు, పాలకుర్తి దేవస్థాన, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మాజీ జడ్పీటీసీ కమలాకర్, మం డల మాజీ అధ్యక్షులు యాదగిరిరావు, సోమనర్సింహారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ సోమారెడ్డి, నాయకులు సుధీర్కుమార్, శ్రీనివాస్, సునీల్రెడ్డి, విజయ్పాల్రెడ్డి, మనోహర్గౌడ్, సమ్మయ్య, సుధాకర్, లింగమూర్తి, జ్ఞానేశ్వరాచారి, వెంకన్న, రాజుయాదవ్, వెంకట్రామయ్య,విక్రమ్రెడ్డి, గంగాధర్యాదవ్, రవి, యూ త్ నాయకులు హరీశ్యాదవ్, అనుదీప్, రామ్మూర్తి, యాకన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.