పాలకుర్తి రూరల్, నవంబర్ 26: ఆరు దశాబ్దాల పాలనలో దేశాన్ని, తెలంగాణను అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాల్నా.. లేక 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాల్నా.. ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. ఆదివారం మండలంలోని కోతులబాద్, అయ్యంగారిపల్లి, తిరుమలగిరి, ముత్తారం, తొర్రూరు(జే), రాఘవపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పుళ్లతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మోసాల కాంగ్రెస్ను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తామని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 హెచ్పీ మోటార్లు రైతాంగానికి ఎవరు కొనిస్తరని ఆయన ప్రశ్నించారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాల్నా.. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు. రాజకీయ బ్రోకర్లను తరిమికొట్టాలని ఆయన కోరారు. 40 ఏళ్లుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కొత్తగా అమెరికా నుంచి వచ్చిన వారికి ప్రజల కష్ట సుఖాలు ఏం తెలుసని ప్రశ్నించారు. నియోజక వర్గ ప్రజలకు ఆపద సమయంలో అండగా ఉన్నానని, కరోనా కష్ట కాలంలో ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. సొంత డబ్బులతో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉచితంగా టైలరింగ్లో శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లు ఇప్పించానని తెలిపారు. తాను మళ్లీ గెలిచాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానన్నారు. గ్రామాల్లో కోతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, ప్రజల ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి కోరారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మొద్దని కోరారు. 15 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎర్రబెల్లిని మరోసారి ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ ము స్కు రాంబాబు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మ దార్, పీఏసీఎస్ చైర్మన్ గోనె మైసిరెడ్డి, యూత్ ఇన్చార్జ్ ఎర్రబెల్లి వినయ్రావు, సర్పంచ్లు గాదరి యాదమ్మ సోమ న్న, ముస్కు రజిత కర్ణాకర్, కల్వల భాస్కర్రెడ్డి, నాయిని మల్లారెడ్డి, ఎంపీటీసీలు కోడిశాల యాదగిరి, మడిపెల్లి కౌసల్య సోమయ్య, మడిపెల్లి వేణు, ఉప సర్పంచ్ బక్క నాగరాజు, పసులాది సోమనర్సయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు దామెర సోమన్న, కూటికంటి పరశురాములు, రామిరెడ్డి, ఈర్ల రాజు, నల్ల రమేశ్, పెంతల కుమారస్వామి, చింతకింది ఉపేందర్, మాజీ సర్పంచ్ కూటికంటి రాజు శ్రీలత, కూటికంటి నరేశ్, కౌడగాని సుధాకర్, పులి ప్రభాకర్, గొటుకుల సోమనాథం, లొంక మల్లేశం, పసులాది శంకర్, కడుదుల సంపత్, పొన్నాల భాస్కర్రెడ్డి, రేగుల నర్సయ్య, మారం యశ్వంత్, చెంచు కర్ణాకర్, రాగం కొమురెల్లి, ప్రతాప్ పాల్గొన్నారు.