రాయపర్తి, మార్చి 1 : చారిత్రక ఆలయాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో జరుగుతున్న లక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలకు త్రిదండి చిన జీయర్ స్వామితో కలిసి మంత్రి బుధవారం హాజరయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తిస్థాపన, ప్రాణప్రతిష్ఠ, గరుడ, ధ్వజస్తంభ, ఆలయ గోపుర ప్రతిష్ఠ ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్, ఆలయ అభివృద్ధి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుడి మైబూబ్రెడ్డి, ఉప సర్పంచ్ గుడి యుగేంధర్రెడ్డి, నాయకులు ముద్రబోయిన వెంకటేశ్వర్లు, వశపాక కుమారస్వామి, దొంతరబోయిన యాదగిరి, జినుగు నర్సింహారెడ్డి, సోమిరెడ్డి, దోకురు దేవేందర్, గజవెల్లి రామశేఖర్ ఆలయ అనువంశిక పూజారి పరాశరం సుదర్శనాచార్యులు పాల్గొన్నారు.
మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధి పనులను మంత్రి ఎర్రబెల్లి దంపతులు చినజీయర్ స్వామితో కలిసి పరిశీలించారు. తొలుత స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పూస మధు, ఆలయ అనువంశిక ధర్మకర్తల మండలి ప్రతినిధులు కుందూరు రామకృష్ణమారెడ్డి, రమేశ్రెడ్డి, గోపాల్రెడ్డి, విక్రమ్రెడ్డి, ఆలయాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ అనువంశిక పూజారులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు, వెంకట రమణాచార్యులు, సర్పంచ్లు నలమాల సారయ్య, గూబ యాకమ్మ ఎల్లయ్య, బానోత్ జగన్నాయక్, గొట్టం ప్రతాప్రెడ్డి, మంద సునీతాయాకూబ్రెడ్డి పాల్గొన్నారు.