కొడకండ్ల, ఫిబ్రవరి 27: నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మంత్రులు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసానిచ్చారు . అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రీతి దవాఖానలో చేరినప్పటి నుంచి ఆమె సమాచారాన్ని తెలుసుకుం టున్నానని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు, సత్యవతి రాథోడ్కు ఫోన్ చేసి ప్రీతి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారని, సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కేటీఆర్ కూడా నేడు బహిరంగ సభ వేదికగా ప్రీతికి న్యాయం చేస్తామని ప్రకటించినట్లు తెలిపారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షలు, మరో 20 లక్షలు తాను ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా కుటుంబంలో వారి చదువులకు తగ్గ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి తెలిపారు. మూడు ఎకరాల భూమి అమ్మి పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాడు.. కానీ, ప్రీతికి ఇలా జరగడం చాలా అన్యాయమన్నారు. మంత్రి హరీష్ రావు డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వైద్యవిద్య వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సవరిస్తామని తెలిపినట్లు ఎర్రబెల్లి చెప్పారు. పోలీసు వ్యవస్థ కూడా మంచిగా పని చేస్తుంది.. వారికి అభినందనలు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షపడేవిధంగా చూస్తామన్నారు.
ప్రీతి మరణాన్ని రాజకీయం చేయొద్దని వేడుకుంటున్న.., న్యాయం కోసం డిమాండ్ చేయం డి.. కానీ, వక్రమార్గంలో రాజకీయం చేయొద్దన్నారు.మంత్రి సత్యవతి రాథో డ్ మాట్లాడుతూ.. డాక్టర్ ప్రీతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది.. ప్రీతి చాలా చురుకైన పిల్ల, ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రీతి కుటుం బానికి ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ ధరావత్ జ్యోతి, మాజీ జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామోజీ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మధుసూదన్, దేశగాని సతీశ్గౌడ్, సర్పంచ్ రాజ్కుమార్, రాజిరెడ్డి, మేటి సోమరాములు పాల్గొన్నారు.