ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా ప్రజాప్రతినిధులు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. విశాలమైన పార్కింగ్, హెలీప్యాడ్ వంటి సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలన్నారు. సమీకృత భవనం ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.
వరంగల్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వీలైనంత త్వరగా వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మాణం చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకో వా లని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి మంగళవారం హనుమ కొండలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీకృత భవనం డిజైన్ మ్యాపులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని వస తులు, విశాలమైన పార్కింగ్, హెలీప్యాడ్ వంటి సౌకర్యాలు ఉండేలా ప్లానింగ్ ఉండాలని సూచించారు.
సమీకృత భవనం ఆవరణలో పచ్చదనం వెల్లివిరిసే లా ఎక్కువగా మొక్కలను పెంచాలని, దీనికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చే యాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుద ర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్, కలెక్టర్ గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ శ్రీవత్సవ, కుడా పీవో అజిత్రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణాలు వేగ వంతం చేయడంపైనా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేలు, ప్రజాప్ర తినిధులతో విడిగా సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా హనుమకొండ అంబే ద్కర్ జంక్షన్లో మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బాబాసాహె బ్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.