ఆత్మకూరు, ఫిబ్రవరి 24 : వరంగల్, హనుమకొండలోని మినీ మేడారం జాతరలు ముగిశాయి. శనివారం రాత్రి తల్లులు వనప్రవేశం చేశారు. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ తల్లులను సంప్రదాయ పద్ధతిలో ప్రధాన పూజారులు గోనెల సారంగపాణి, గోనెల వెంకన్న, గుల్లపల్లి సాంబరావు, గోనెల రవీందర్, సహాయ పూజారులు ఉడుతనబోయిన గోవర్ధన్, రేగుల సునీత డప్పు చప్పళ్లు, శివసత్తుల పూనకాల నడుమ వన ప్రవేశం చేయిచారు. కాగా, భక్తులు శనివారం రోజు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 25లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిశోర్కుమార్, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, జాతర కమిటీ చైర్మన్ శీలం రమేశ్ పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని పులిగిల్ల, కంఠాత్మకూర్ గ్రామాల్లో డప్పు చప్పుళ్లతో పూజారులు , భక్తులు వన దేవతలను తిరిగి వన ప్రవేశం చేయించారు. మూడు రోజులుగా వందలాది భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జాతర కమిటీ బాధ్యులు రాయిడి రాజిరెడ్డి
శాయంపేట : మండలంలోని జోగంపల్లి జాతర ముగిసింది. తల్లులిద్దరూ వన ప్రవేశం చేశారు. అనంతరం జాతరలో హుండీలను లెకించారు. మొత్తం రూ.34 వేల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతర చైర్మన్ ప్రకాశ్రెడ్డి, కోశాధికారి అమ్మ అశోక్, పల్నాటి జలంధర్, కడవెండి పరిపూర్ణ చారి, చంద్రారెడ్డి, నరసయ్య పాల్గొన్నారు.
భీమదేవరపల్లి: ములుకనూరు, కొత్తకొండలో కోయపూజారులు డప్పుచప్పుళ్ల మధ్య తల్లులను వనంలోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్లు మాడుగుల వీరస్వామి, వూదరి రవీందర్, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, యాటపోలు రాజమణీ, పంచాయతీ కార్యదర్శులు జంగం పూర్ణచందర్, వీరన్ననాయక్ పాల్గొన్నారు.