బయ్యారం, సెప్టెంబర్ 16: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యం కృషి చేస్తున్న టీచర్లు, ఆయాల సేవలను గుర్తించి సర్కారు వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు తగినట్లుగా నాలుగు రోజుల క్రితం జీవో జారీ చేసింది. జిల్లాలో 1,437 అంగన్వాటీ కేంద్రాలుండగా అందులో 1,285 మెయిన్, 150 మినీ సెంటర్లున్నాయి.
వాటిల్లో 1,239 మంది టీచర్లు, 112 మంది మిటీ టీచర్లు, 1,113 మంది హెల్పర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జిల్లాలోని 1,464 మంది అంగన్వాడీ సిబ్బందికి లబ్ధి చేకూరనున్నది. అలాగే సర్కారు మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ వయసును 65ఏళ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ చేసే వారికి ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.లక్ష , మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50వేలు అందించనున్నది. అంతేకాకుండా 50 ఏండ్ల వరకు ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.2లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది.
దురదృష్టవశాత్తు సర్వీస్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణసాయం కింద రూ.20వేలు, హెల్పర్లకు రూ.10వేల సాయం అందించనున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పింఛన్ మంజూరు, వర్ ప్రెషర్ తగ్గించేవిధంగా యాప్ సింప్లిఫైడ్ చేయనున్నట్లు ప్రకటించింది.
స్వరాష్ట్రంలోనే గుర్తింపు
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సేవలను స్వరాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. 2015కు ముందు అంగన్వాడీ టీచర్లకు రూ. 4,200 వేతనం ఉండగా, మీని టీచర్లు, హెల్పర్లకు కేవలం రూ.2,200 వేతనం ఉండేది. వారి సేలవను గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాలను స్వరాష్ట్రంలో మూడు సార్లు పెంచారు. దీంతో ప్రస్తుతం టీచర్లకు రూ.13,650, హెల్పర్కు రూ.7,800 వేతనం పొందుతున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బాధ్యత వాహించాల్సి ఉన్నా, బాధ్యతారాహిత్యంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అయినా కేంద్రంతో సంబం ధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి కృషి చేస్తున్నది. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చే వేతనాల్లో టీచర్లకు 19శాతం, హెల్పర్లకు 17శాతం మాత్రమే కేంద్రం వాట ఉండగా, మిగితా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అంగన్వాడీలు అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో అంగన్వాడీల సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు సైతం అందజేసింది.
సంతోషంగా ఉన్నది
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న మా సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు తీర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి మూడు సార్లు వేతనాలు పెంచారు. ఇప్పుడు అనేక సదుపాయాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నది. సర్కారు నిర్ణయాలతో ఆర్థింకంగా ఇబ్బంది పడుతున్న మాకు ఎంతో ఊరటనిచ్చింది.
-గాదెమ్మ, హెల్పర్, కోటగడ్డ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం మెయిన్ కేం ద్రాలుగా అప్గ్రెడ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నది. గతంలో హె ల్పర్ల వలే మినీ సెంటర్ల టీచర్లు రూ.7,800 వేతనం మాత్రమే పోందేవారు. ఇప్ప డు బీఆర్ఎస్ సర్కారు అప్గ్రెడ్తో రూ.13,650 వేతనంతో పాటు కొత్తగా సెంటర్కు హెల్పర్ నియామకం జరగనున్నది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రభుత్వం చేసిన మేలును మర్చిపోము.
-అరుణ, మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్,
అల్లిగూడెం