రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ అందిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్నాయక్
వరంగల్, ఫిబ్రవరి 16(నమస్తేతెలంగాణ) : ప్రియతమ నేత కేసీఆర్ పుట్టిన రోజును గులాబీ సైన్యం ఘనంగా జరుపుకుంటోంది. ‘మూడు రోజుల వేడుక’లో భాగంగా రెండో రోజు మెగా రక్తదాన శిబిరాలు జోరుగా నిర్వహించి అభిమానం చాటుకొంది. అలాగే పేదలకు అన్నదానం, దవాఖానల్లో రోగులకు పండ్లు, వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు ఇలా ఒక్కోతీరుగా సేవలందిస్తున్నది. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో మెగా రక్తదాన శిబిరాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందించారు. మహబూబాబాద్లోని లయన్స్ క్లబ్ భవన్లో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హాజరై 140 మంది రక్తదాతలకు ప్రశంసా పత్రాలతో పాటు టీ కప్పులు అందించారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, జీఎంహెచ్లో అన్నదానం చేశారు. నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, రెండు వేల మంది దాతలు రక్తదానం చేశారు. మరిపెడ, చిన్నగూడూరులో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. మొగుళ్లపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేదలకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.