మహదేవపూర్(కాళేశ్వరం), జూలై 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు వరద కొనసాగుతున్నది. బుధవారం 3,73,500 క్యూసెక్కుల ప్రవాహం రాగా బరాజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్బెడ్ నుంచి సముద్ర మట్టానికి 93 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి నదీ ప్రవాహం పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ ప్రవహిస్తున్నది. ప్రస్తుత నీటిమట్టం సుమారు 5మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు వెల్లడించారు.