తాడ్వాయి, ఫిబ్రవరి 28 : మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. జాతర అనంతరం వచ్చే బుధవారం తిరుగువారం పండుగగా నిర్వహించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ నెల 5న గుడిమెలిగే పండుగ సందర్భంగా అమ్మవార్ల పూజా సామగ్రిని బయటకు తీసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం వచ్చే బుధవారం మండెమెలిగే పండుగ, త ర్వాత వచ్చే బుధవారం జాతర ప్రారంభ పూ జలు చేశారు. తిరుగు వారం వరకు మేడారంలోని సమ్మక్క పూజా మందిరం, కన్నెపల్లిలో ని సారలమ్మ ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ముగియగానే పూజా కార్యక్రమాలు నిర్వహించిన వ స్ర్తాలు, పూజా సామగ్రిని పూజారులు శుద్ధి చే శారు. అనంతరం పూజారులు కుటుంబాలకు చెందిన ముత్త యిదువలు డోలు వాయిద్యాల నడుమ పూజా మందిరాలకు చేరుకొని గద్దెలను అలంకరించారు. పూజారుల కుటుంబాలు తలనీలాలను సమర్పించారు. తల్లులకు పసుపు, కుంకుమ, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి పూజామందిరాల వద్దకు చేరుకుని రాత్రి అమ్మవార్ల పూజా మందిరాల వద్ద జాగారం చేస్తారు. అమ్మవార్లకు చివరిగా పూజలు చేసి పూజా మందిరాలకు తాళాలు వేస్తారు.
మేడారం సమ్మక్క-సారలమ్మకు బుధవారం తిరుగువారం మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర అనంతరం వచ్చే బుధవారం అమ్మవార్ల పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించడం ఆనవాయితీ. తెలుగు రాష్ర్టాల్లోని పలు జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు పలు వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి తల్లుల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో తల్లుల గద్దెల ప్రాంగణంతో పాటు జాతర పరిసరాలు రద్దీగా మారాయి.
భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు వాహనాలను గద్దెల సమీపానికి వచ్చేందుకు అనుమతించలేదు. హరిత హోటల్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశానికి తరలించారు. కాగా, మంత్రి సీతక్క బుధవారం రాత్రి తిరుగువారం మొక్కులు చెల్లించారు. అనంతరం మృతిచెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కమాండ్ కం ట్రోల్ రూమ్లో డీపీవో వెంకయ్యతో జా తర పరిసరాల్లో జరుగుతున్న పారిశుధ్య పనుల వివరాలను తెలుసుకున్నారు.