వరంగల్, మార్చి 2 : హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు మూడో రోజుకు చేరింది. శనివారం 112 హుండీలను లెక్కించారు. రూ. 3కోట్ల46లక్షల61వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మొదటి రోజు 134 హుండీలను లెక్కించగా, రూ. 3,15,40,000 ఆదాయం, రెండో రోజు 71 హుండీల ద్వారా రూ. 2,98,35,000, మూడో రోజు 112 హుండీల ద్వారా రూ. 3,46,61,000 ఆదాయం సమకూరినట్లు మేడారం జాతర ఈవో రాజేంద్రం తెలిపారు. మొత్తం మూడు రోజుల్లో రూ. 9.60 కోట్ల్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఇంకా 201 హుండీలు లెక్కించాల్సి ఉంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతారావు, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, మేడారం పూజారులు పాల్గొన్నారు.