భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం 42 డిగ్రీలు నమోదుకాగా, మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. కోల్బెల్ట్ ఏరియాలోని భూపాలపల్లిలో ఉదయం 8గంటలకే ఎండ ప్రభావం చూపిస్తుండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.
తప్పని పరిస్థితుల్లో జిల్లాకేంద్రానికి వచ్చిన ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం జ్యూస్ పాయింట్లు, కూల్ డ్రింక్స్ దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత తీవ్రమైన ఎండలుంటే.. మేలో ఏవిధంగా ఉంటాయోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.